తొమ్మిదవ రోజుకు చేరుకున్న సులభ్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె – అండగా జనసేన

తిరుమల తిరుపతి దేవస్థానం సులభ్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె తొమ్మిదవ రోజుకు చేరుకున్న సందర్బంగా జనసేన పార్టీ పిఏసి సభ్యులు ఉమ్మడి చిత్తురు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ మరియు కార్మికులందరూ కలిసి ఇస్కాన్ టెంపుల్ మైదానం నుంచి పాదయాత్రగా శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానంకు చేరుకొని వారి బాధలను అమ్మ వారికి విన్నవించుకుని మొక్కులు తీర్చుకున్నారు. టీటీడీ యాజమాన్యం ఇప్పటికైనా వీరి కష్టాలను గుర్తించి న్యాయమైన కోరికలను తీర్చాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ అమ్మవారికి కోరుకున్నారు. డా.హారి ప్రసాద్ కార్మికులందరికీ మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు, తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి, తిరుపతి నగర ఉపాధ్యక్షులు పార్ధు, జిల్లా కార్యదర్శులు హేమ కుమార్, ఆనంద్, బాటసారి, పార్టీ సీనియర్ నాయకులు పొర్లు దండాలు ఈశ్వర రాయల్, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, నగర కమిటీ సభ్యులు మనోజ్ కుమార్, హేమంత్, కిరణ్ కుమార్, కిషోర్ రెడ్డి, వీరమహిళ లావణ్య శర్మ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.