శ్రీ అమరలింగేశ్వర స్వామి వారి 2వ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న బొర్రా అప్పారావు

సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, అంచుల వారి పాలెం గ్రామంలో శ్రీ అమరలింగేశ్వర స్వామి వారి 2వ వార్షికోత్సవం సందర్భంగా, అంచుల వారి పాలెం తోట నర్సయ్య ఆధ్వర్యంలో, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాజుపాలెం అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా సత్తెనపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు పాల్గొనడం జరిగినది. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగినది. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులతో మమేకమై గ్రామంలోని పరిస్థితులను అలాగే పార్టీ వ్యవహారాలను ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ రఫీ, రాయుడు, బాలకృష్ణ, పసుపులేటి పవన్ కళ్యాణ్, షేక్ జాన్ ఫిరా, మండల కమిటీ సభ్యులు, గ్రామ అధ్యక్షులు గ్రామ కమిటీ సభ్యులు గ్రామంలోని జనసైనికులు, వీర మహిళలు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.