మహాత్మా జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన సుండుపల్లి జనసేన

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద 196 వ జయంతి వేడుకలలో భాగంగా జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్, జనసైనికులు, ప్రజాసంఘాల నాయకులు, బీసీ నేతలతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అలానే రామ శ్రీనివాస్ మాట్లాడుతూ… అణగారిన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు, మహిళల హక్కుల కోసం, వారికి విద్యా అవకాశాలు కల్పించడం కోసం పనిచేసిన గొప్ప సంఘసంస్కర్త, సమసమాజం నిర్మాణం కోసం కృషి చేసి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచిన మహోన్నత వ్యక్తి అని అందరూ చైతన్యవంతులై రాబోయే తరాల వారికి ఆదర్శంగా నిలవాలని కోరుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఆ మహనీయుని జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిలు, బీసీ నేతలు, ప్రజా సంఘాల నాయకులు, మండల ప్రజలు పాల్గొన్నారు.