కాకినాడ సిటీ ఇంటింటికి వారాహి పబ్లిసిటీ కోఆర్డినేటర్ గా సుంకర సురేష్ బాబు

కాకినాడ సిటీ: జూన్ 14న అన్నవరం నుండి ప్రారంభమయ్యే వారాహి యాత్ర కార్యక్రమానికి కాకినాడ సిటీలో ఇంటింటికీ వారాహి కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రోగ్రామ్ పబ్లిసిటీ కోఆర్డినేటర్ గా సీనియర్ జనసేన నాయకులు సుంకర సురేష్ బాబు నియమించినట్లు జనసేన పార్టీ పీఓసీ సభ్యులు ముత్తా శశిధర్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం నియామక పత్రాన్ని సుంకర సురేష్ బాబుకి అందించారు. అనంతరం శశిధర్ మాట్లాడుతూ వారాహి యాత్రను విజయవంతం చేసేందుకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా వీరమహిళలు యాత్రలో పాల్గొని సమస్యలు తెలిపే విధంగా కృషి చేయాలన్నారు. యాత్రకు సంబంధించి సహాయ సహకారాలు ప్రతి ఒక్కరూ అందించాలని ఈ సందర్భంగా సుంకర సురేష్ కు సూచించారు.