జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తగరపు శ్రీనివాస్

  • హుస్నాబాద్ నియోజకవర్గ జనసేన ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

హుస్నాబాద్ నియోజకవర్గం: 75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని హుస్నాబాద్ నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మండల అధ్యక్షుడు మల్లెల సంతోష్, ఉపాధ్యక్షుడు కొలుగూరి అనిల్, చిగురుమామిడి మండల అధ్యక్షుడు గుండా సాయి చంద్, నేవూరి పవన్, మైలారపు ప్రభంజన్, పార్నంది అభిరామ్, తేజ తదితరులు పాల్గొన్నారు.