తాళ్లరేవు జనసేన మండల కమిటీ సమావేశం

ముమ్మిడివరం నియోజకవర్గం: జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ అధ్యక్షతన బుధవారం తాళ్లరేవు మండలం, పి మల్లవరం గ్రామంలో తాళ్లరేవు మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం గురించి, గ్రామ కమిటీల గురించి, బూత్ కమిటీల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, ఉపాధ్యక్షులు కుంది దుర్గా ప్రసాద్, ప్రధాన కార్యదర్శులు వైదాడి దశరద్, మత్తుర్తి సత్య మణికంఠ, కార్యదర్శులు విఆర్ఎన్ బి ప్రసాద్, పోసింశెట్టి సూర్య ప్రకాష్, వంగా త్రిమూర్తులు, అంకన ఆంజనేయులు, రాయుడు గోవింద్, సంయుక్త కార్యదర్శులు టేకుమూడి త్రిమూర్తులు, కర్నీడి నాని, సుందరంపల్లి సత్యనారాయణ, కొమ్మోజు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.