కడప అభివృద్ధి కూటమి లక్ష్యం: జనసేన రమణయ్య
కడప నగరం, స్థానిక శ్రీరాముల బజార్ లో జనసేన తెలుగుదేశం బిజెపి కూటమి కడప ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డప్ప గారి మాధవి గారిని అత్యధిక మెజార్టీ గెలిపించాలని జనసేన జిల్లా నాయకులు తుంగ రమణయ్య ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని తెలిపారు. కడప ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి మాధవి కి ప్రజలు ఓట్లు వేసి వేయించి మెజార్టీ గెలిపించాలని పిలుపునిచ్చారు. అధికారంలో వచ్చిన తర్వాత కడప నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. కడప నగరంలో ఉన్న యువతకు కుప్పర్తి పరిసర ప్రాంతాల్లో వందల సంఖ్యలో పరిశ్రమ ఏర్పాటు చేసి వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలియజేశారు. కడప నగరం ఐదు సంవత్సరాలలో ఇటువంటి అభివృద్ధి జరగలేదని, కడప నగరంలో కొంతమంది నగరాన్ని దోచుకొని వేల కోట్లు సంపాదించుకున్నారని విమర్శించారు. కడప నగరంలో మంచినీటి సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు నిరుద్యోగులకు అన్ని సౌకర్యాలతో కూడిన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కడప నగర ప్రజలకు యువతకు నిరుద్యోగులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని. కడప అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేశారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 3 వేల రూపాయలు ఇస్తామని తెలియజేశారు. చంద్రబాబు గారు సహకారంతో కడప నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన రాయలసీమ కోఆర్డినేటర్ రంజిత్, సాయి గజ్జల, సాయి స్వరూప్, సాయి సిద్ధార్థ, మధు, కిరణ్, కోలామల్లి, ప్రసాద్, మహేష్, సుమన్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-11-at-5.25.26-PM-1024x472.jpeg)