జనసేనకు అధికారం ఇస్తే సమస్యలు పరిష్కారం.. రాటాల రామయ్య

  • 71వ రోజుకు చేరుకున్న పవనన్న ప్రజాబాట..

ఒంటిమిట్ట: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం మంగళవారం 71వ రోజుకు చేరుకుంది. రాజంపేట అసెంబ్లీ జనసేన పార్టీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా ఒంటిమిట్ట మండల పరిధిలోని మండపంపల్లి పంచాయతీ, మారయ్య గారి పల్లెలో పర్యటించి, అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని జనసేన పార్టీ రూపొందించిన మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు అందించారు. జనసేన పార్టీ తరఫున తన వంతు కృషి చేస్తానని ఈసందర్భంగా.. జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య భరోసా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ.. రాబోయే 2024 ఎన్నికల్లో ప్రజలందరూ జనసేనను ఆదరించి ఒక్కసారి జనసేనకు అధికారం ఇస్తే పేద బడుగు బలహీన వర్గాల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ప్రజలందరూ జనసేన పార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా రాటాల రామయ్య కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు, తదితరులు పాల్గొన్నారు.