వైసీపీ నాయకుల భూ అక్రమణను నిరోధించాలని టిడిపి, జనసేన ధర్నా

ఎస్.కోట నియోజకవర్గం: ఎస్.కోట రెవెన్యూ పరిది సర్వే నంబర్ 82/2 లో భుమి సింహాచలం కుమారుడు సోములు పేరుమీద ఎఫ్ సి ఓ రికార్డులో పేరు నమోదు అయితే దానిని కొట్టివేసి విన్నకోట సత్యనారాయణ తండ్రి పెద్ద జోగారావు పేరు వ్రాసి రికార్డ్ ట్యాంపరింగ్ చేసినట్టుగా కనబడుతున్నది. సదరు బుమిపయిన రొంగలి దేముడు నాటి నుండి నేటి వరకు సాగులో ఉన్నప్పటికీ సదరు భూమి తాము కొనామని అంబటి రమేష్ సదరు బుమిని ఆక్రమణలో తీసుకోవాలనే దురుద్దేశంతో స్తంబాలు పాతిపెట్టే ప్రయత్న జరుగుతున్నదని కోర్టు తీర్పు వచ్చేవరకూ ఆక్రమణ ప్రయత్నాన్ని నిరోధించి ఎంక్వయిరీ చేసి సగు హక్కు తమకు కల్పించాలని కోరుతూ తహశీల్దార్ కి, ఎస్. కోట ఎస్.ఐ తరకేశ్వరావు కు వినతిపత్రం ఇవ్వడము జరిగింది. ఈ కార్యక్రమములో సాగు రైతు రొంగలి దేముడు, జనసేన నియోజకవర్గ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు, టీడీపీ మండల కార్యదర్శి జుతడ రమాసత్యము, మాజీ ఎంపీటీసీ ఎడారి రమేశ్ పలువురు మహిళలు పాల్గొన్నారు.