టీ విత్ డాక్టర్ బాబు

రాజోలు నియోజకవర్గం: టీ విత్ డాక్టర్ బాబు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ రాజోలు నియోజకవర్గం లక్కవరం గ్రామంలో భవన నిర్మాణ కార్మికులను కలసి వారు పడుతున్న ఇబ్బందులను, సమస్యలను రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు కార్మికులని అడిగి తెలుసుకున్నారు. సుదీర్ఘంగా వారితో మాట్లాడి గాజు గ్లాసులో టీ అందరికి ఇచ్చి భవన నిర్మాణ కార్మికుల యొక్క సమస్యలను తెలుసుకుంటూ ఈ ఐదేళ్ల ప్రభుత్వంలో భవన కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని లేబర్ సెస్ 2,500 కోట్లు దారి మళ్లించారని, కార్మికుల కుటుంబాలకు చెల్లించాల్సిన ప్రసూతి సహాయం, వివాహ బహుమతులు, సహజ మరణం, ప్రమాద బీమా లను, 1214 మెమో ద్వారా నిలుపుదల చేసి, భవన కార్మికులను ముంచేసారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో జగన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం చేసిన భవన కార్మికుల సంక్షేమ బోర్డును పునరుర్ధిస్తామని, భవన కార్మికులకు జగన్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలకు తెలియచేస్తామని, భవన కార్మికులకు జనసేన పార్టీ అండగా ఉంటామని, డాక్టర్ రమేష్ బాబు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గోదావరి జోన్ కో కన్వీనర్ పినిశెట్టి బుజ్జి, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, జనసేన నాయకులు రావూరి నాగు, మల్కిపురం ఎంపీటీసీ జక్కంపూడి శ్రీదేవి శ్రీనివాస్, ఉండపల్లి అంజి, రాపాక సత్యనారాయణ, రాపాక మహేష్, మేడిచర్ల సత్య, మల్కిపురం మండల ఉపాధ్యక్షులు కుసుమ నాని, ముత్యాల జగదీష్, చేగొండి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.