బాబు పాలూరుని కలిసిన టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు

బొబ్బిలి: జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరుని కలిసి వినతిపత్రాన్ని అందజేసిన ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు. పి ఆర్ సి, సిపిఎస్ వంటి పలురకాల వారి సమస్యలను జనసేన-టీడిపి ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చమని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల తరపున వారు కోరగా, బాబు పాలూరు స్పందిస్తూ, ఇప్పటికే శ్రీ పవన్ కళ్యాణ్ గారు సిపిఎస్ మరియు పి ఆర్ సి అంశాల మీద ఓ అవగాహనకి వచ్చారని, పలుసార్లు మా అధినేత పలు సభల్లో ప్రస్తావన కూడా చేసారని, మన కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మీ ఉద్యోగుల అభిలాషకు దగ్గరగానే తగు నిర్ణయం తీసుకుంటారని తెలియజేయడం జరిగింది. అలాగే మీ ఈ సూచనలను కూడా మా మేనిఫెస్టో కమిటీకి చేరవేస్తానని బాబు పాలూరు ఫెడరేషన్ ప్రతినిధులకు తెలియజేసారు.