తవణంపల్లెలో జనసేన-తెలుగుదేశం పార్టీ ఇంటింటి ప్రచారం

పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలంలో తెలుగుదేశం నాయకులు డాక్టర్ కలికిరి మురళిమోహన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎగువ తవనంపల్లి పంచాయతీ మిట్టపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారంను డాక్టర్ కలికిరి మురళిమోహన్ నిర్వహించడం జరిగింది. రానున్న జనసేన – టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందించనున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు టిడిపి నాయకులు డాక్టర్.కలికిరి మురళిమోహన్, జనసేన మండల అధ్యక్షులు శివ, ప్రధాన కార్యదర్శి ఉదయ్ మరియు సీనియర్ నాయకులు నాగేంద్ర మరియు జనశైనికులు వేణుగోపాల్, మనోజ్, శ్యామ్, గుణశేఖర్, నిఖిల్, పృధ్వీ, యుగంధర్, తారక్, నితీష్, లోకేష్, హరీష్, సత్య తెలుగు దేశం మండల పార్టీ అధ్యక్షుడు దిలీప్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి మధుకుమార్, మాజీ జెడ్పిటీసి సభ్యులు వెంకటేష్ చౌదరి, మరియు ఇరు పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.