సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ విలేకరుల సమావేశం

సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, సర్వేపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయం నందు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పేదవారి గురించి ఆలోచించే ఉద్దేశం ఉంటే పెరిగిన సిమెంటు రేట్లను తగ్గించాలి అదేవిధంగా మన రాష్ట్రంలో సిమెంట్ కంపెనీలు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేటుతో అమ్ముతున్నారు అయితే అందులో ముఖ్యమంత్రి కంపెనీ భారతి సిమెంట్ కూడా ఉంది అయితే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించి ఒకే రేటుని అమ్మే విధంగా చర్యలు చేపట్టాలి అదేవిధంగా పేదవారికి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన త్వరితగతిన నిర్మాణం జరగకపోతే తిరిగి వాటిని వెనక తీసుకొని ఇతరులకు ఇస్తానని చెప్పడం ఎంత వరకు సమంజసం అందులోనూ రెండు రోజుల క్రితమే సిమెంట్ రేట్లు పెరగడం త్వరితగతిన ఇల్లు నిర్మాణాలు చేసుకోవాలని చెప్పడం వీటికి కారణాలు ఏమిటి ఇకనైనా ప్రభుత్వం అన్నివిధాల ఆలోచించి భవన నిర్మాణానికి సంబంధించిన ఇసుక, సిమెంటు, స్టీల్, ఇటుక వీటన్నిటి ధర కూడా సామాన్యులకి పేదలకి అందుబాటులో ఉండేవిధంగా చర్యలు చేపట్టాలి ఈరోజు సినిమా వినోదం పైన ప్రజలకి పేదలకి అవసరం లేకపోయినా వాటిపైన మీరు పెట్టిన దృష్టిని ఈరోజు భవన నిర్మాణ సామాగ్రి మీద కూడా పెట్టాలని సిమెంట్ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి సిమెంట్ రేట్ నీ అందుబాటులోకి తీసుకురావాలని జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పోలంరెడ్డి ఇందిరా రెడ్డి శివరాత్రిసందీప్, సందురి శ్రీహరి, చందన్, అవినాష్, వంశి తదితరులు పాల్గొన్నారు.