చీపురుపల్లి జనసేన ఆధ్వర్యంలో టీమ్ పిడికిలి పోస్టర్ విడుదల

చీపురపల్లి నియోజకవర్గంలో నాలుగు మండలాల అధ్యక్షుల ఆద్వర్యంలో టీం పిడికిలి వారి ఇక తగ్గేదెలే.. యుద్ధం మీరు మొదలు పెట్టారు మేము ముగిస్తాం.. అనే గోడ పత్రికను విడుదలచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విసినిగిరి శ్రీనివాసరావు, పెద్ది వెంకటేష్, కృష్ణవేణి, సంతోష్ మరియు జనసైనికుల పాల్గొనడం జరిగింది. అనంతరం విసినిగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నాటుకులనుద్దేసించి యుద్ధం మీరు మొదలుపెట్టారు దాన్ని మేము ముగిస్తాం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇకపై మేము తగ్గేదే లేదు రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పక విజయం సాధిస్తుందని, రాష్ట్ర ప్రజలు జనసేన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు లక్షుం నాయుడు, గొర్ల రమణ, రామకృష్ణ, కిరణ్, శంకర్, వినోద్, చిన్ననాయుడు, బాల, భాస్కర్ జగదీష్, శ్రీను, రామకృష్ణ, స్వామి భవాని తదితరులుపాల్గొన్నారు.