మధిర జనసేన ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

మధిర, జనసేన పార్టీ మధిర నియోజకవర్గం నాయకులు తాళ్లూరి డేవిడ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ విద్యార్థి విభాగ కార్యనిర్వహక సభ్యుడు గంధం ఆనంద్, బోనకల్ మండల నాయకులు షేక్ జానీ పాషా, అద్దంకి సంతోష్, షేక్ బాజీ, నవీన్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా తాళ్లూరి డేవిడ్ మాట్లాడుతూ… తెలంగాణ ఆవిర్భావ ఒక చారిత్రాత్మక ఘట్టం ప్రజలంతా ముక్తకంఠంతో కోరి సాధించుకున్న ఒక అపురూప విజయం. ఈ విజయం కోసం ఎంతో మంది ప్రాణాలు ధారపోశారు. మరెందరో తమ జీవితాల్లో అర్పించారు వారి త్యాగాల ఫలితమే నేటి మన తెలంగాణ తెలంగాణ ఆవిర్భవించి ఎనిమిది వసంతాల పూర్తవుతున్న సందర్భంగా నా పక్షాన మధిర నియోజకవర్గం జనసేన పార్టీ పక్షాన తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో అమరవీరుల బలి దానాలతో సాధించుకున్న తెలంగాణ ఉద్యమంలో ఆకాంక్షలు పూర్తిగా నెరవేరలేదని అన్నారు నాటి నిర్బంధాలకు ఎరవకాకుండా పోరాడి తెలంగాణ సాధన లో పాల్గొన్న వారికి ఉద్యమ వందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు తాళ్లూరి డేవిడ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగ కార్యనిర్వహక సభ్యుడు గంధం ఆనంద్, మండల నాయకులు షేక్ జానీ పాషా, అద్దంకి సంతోష్, షేక్ బాజీ బాబా, నవీన్ తదితరలు పాల్గొన్నారు.