ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్ జనసేన కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది. వేడుకలలో భాగంగా రాష్ట్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమురి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం జాతీయజెండా ఆవిష్కరించి అమరవీరులను స్మరించుకుని నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ సభ్యులు దామోదర్ రెడ్డి, సురేష్ రెడ్డి, ఇంచార్జిలు శ్రీమతి కావ్య, శ్రీమతి పి. శిరీష, రవీందర్ రెడ్డి, మాధవరెడ్డి, వేముల కార్తీక్, శివ కార్తిక్, రాజేష్ మరియు గ్రేటర్ జనసేన శ్రేణులు పాల్గొన్నారు.