తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా సభను విజయవంతం చేయండి

కాకినాడ రూరల్: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పాల్గొనే తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా సభను విజయవంతం చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర పి. ఏ. సి సభ్యులు కాకినాడ రూరల్ ఇంఛార్జి పంతం నానాజీ కోరారు. కాకినాడ గోడారీగుంట పంతం నానాజీ నివాసం వద్ద జనసేన నాయకులతో కలిసి చలో తుని పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం నానాజీ మీడియాతో మాట్లాడుతూ జనసేన టి.డి.పి పార్టీల పొత్తు కుదిరిన తర్వాత మొట్ట మొదటిసారిగా చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లాలో తునిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారని, ఈ సభను తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు జనసేన నాయకులు విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. వై.ఎస్.అర్ రహిత ఆంధ్రప్రదేశ్, వై.ఎస్.అర్ రహిత కాకినాడ జిల్లా ప్రధాన అంశంగా ఇద్దరు అదినాయకులు తీసుకున్న నిర్ణయం తో తెలుగుదేశం పార్టీ నిర్వహించే చంద్రబాబు గారి సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను, ప్రజలను కోరారు. వై.సి.పి ముక్త ఆంధ్రప్రదేశ్ కై చలో తుని సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. జనసేన శ్రేణులు అందరు పెద్ద ఎత్తున కదిలి వచ్చి విజయవంతం చేయవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన పై గ్రామ గ్రామాల్లో ప్రజలకు వివరిస్తున్నామన్నారు. వెళ్ళిన ప్రతి చోట గ్రామాల్లో మహిళలు ప్రజలు చైతన్యం తీసుకురావడానికి జన సేన టి.డి.పి పార్టీల సిద్ధాంతాలను పాటల రూపంలో ప్రజల వద్దకు తీసుకు వెళ్తున్నామన్నారు. ఈ నెల 10వ తేదీ సభకు తరలి రావాలన్నారు. ఈ మీడియా సమావేశంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.