కొండపి ఎమ్మెల్యే స్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

  • కొండపి ఎమ్మెల్యే స్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన కనపర్తి మనోజ్ కుమార్ మరియు టంగుటూరు జనసేన నాయకులు

ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ మరియు టంగుటూరు మండలం జనసేన నాయకులు, ముఖ్యంగా టంగుటూరు మండలంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను, రాబోయే రోజుల్లో రెండు పార్టీలు చేయబోయే టంగుటూరు మండలంలో ఉమ్మడి కార్యక్రమాలు గురించి, ఇరు పార్టీల సమన్వయం మరియు విధివిధానాల గురించి కొండపిలో ఉమ్మడి పార్టీల విజయం గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టంగుటూరు మండలం జనసేన పార్టీ నాయకులు రాజేష్, చిరంజీవి, సురేష్, విజయ్, రాజశేఖర్, గణేష్, కోటయ్య, ప్రవీణ్, రోశయ్య, అవినాష్ మరియు కొంతమంది జనసైనికులు పాల్గొన్నారు.