మదనపల్లెలో ఉద్రిక్తత – జనసేన నేతల అరెస్టు

మదనపల్లె నియోజకవర్గం: టీడీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అదేశాల మేరకు టీడీపీ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలియజేసారు. కావున మదనపల్లి నిమ్మనపల్లి సర్కిల్ లో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో రోడ్డు మీద బైటయించి నిరసన తెలియజేయడం జరిగింది. క్లిష్ట సమయంలో టిడిపి బంద్ కు మద్దతు ఇస్తున్న జనసేన నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం,రూరల్ మండలం అధ్యక్షులు గ్రానైట్ బాబు,ఐటీ విభాగ నాయకులు జగదీష్, కుమార్, నవాజ్,నారాయణ స్వామి, జనర్దన్ తదితరులు పాల్గొన్నారు.