ప్రజాస్వామ్య బద్దంగా నిరసనలు తెలిపే హక్కు కూడా లేదా?: శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గం: జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటాను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు . సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ మరియు పోలీస్ ఆక్ట్ 30 ఉందని హౌస్ అరెస్టు చేస్తున్నట్టు తెలిపిన పోలీసులు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా నిరసనలు తెలిపే హక్కు కూడా లేకుండా ఈ వైసీపీ ప్రభుత్వం జగన్ నాయకత్వంలో హిట్లర్ కంటే ఘోరంగా, బ్రిటీష్ వారి కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు. కనీసం మీడియాతో మాట్లాడడానికి కూడా కుదరదు అని మీడియా సోదరులను సైతం బలవంతంగా వెనక్కి పంపిన పోలీసులు. ఇదేం ప్రజాస్వామ్యం!!? అని వినుత కోటా ప్రశ్నించారు.