అనుశ్రీ సమక్షంలో జనసేనలో చేరికలు

రాజమహేంద్రవరం సీటీ ఇన్ఛార్జ్ అయిన అత్తి సత్యనారాయణ సమక్షంలో బుధవారం మహిళలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ విధంగా మహిళలు పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మార్పు రావాలి అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి, జనసేన పార్టీ అధికారంలోకి రావాలి అని స్వచ్ఛందంగా మహిళలు పార్టీలోకి రావడం శుభపరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.