టెట్ పరీక్ష వాయిదా వేయాలి..!: వేముల వినయ్ కుమార్ డిమాండ్

*తెలంగాణ ప్రభుత్వం జూన్ 12 నిర్వహించే టెట్ పరీక్ష వాయిదా వేయాలని జన సేన పార్టీ మధిర నియోజకవర్గ విద్యార్ధి విభాగ నాయకులు వేముల వినయ్ కుమార్ డిమాండ్

జనసేన పార్టీ మధిర నియోజకవర్గ విద్యార్ధి విభాగ నాయకులు వేముల వినయ్ కుమార్ సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తెలంగాణలో టెట్ పరీక్ష నిర్వహించే రోజే ఆర్.ఆర్.బి పరీక్ష ఉన్నందన టెట్ పరీక్ష ను వాయిదా వేయాలని విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డినీ, తెలంగాణ ప్రభుత్వాన్ని వేముల వినయ్ కుమార్ డిమాండ్ చేశారు. జూన్ 12వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఆర్.ఆర్.బి పరీక్ష నిర్వహిస్తున్నందున.. అదే రోజు తెలంగాణ ప్రభుత్వం టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) నిర్వహిస్తున్న నేపథ్యంలో లక్షల మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారనీ.. ఒక పరీక్ష రాస్తే మరొక పరీక్ష నష్టపోయే అవకాశం ఉన్నదని.. అదే జరిగితే లక్షల మంది నిరుద్యోగులు రోడ్డున పడతారని అన్నారు. నిరుద్యోగుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన కోరారు.