టీచర్స్ డే సందర్బంగా దర్శకులందరికి ధన్యవాదాలు: వరుణ్‌తేజ్

ముకుంద సినిమాతో వెండితెరకు పరిచయమైన మెగావారసుడు వరుణ్‌తేజ్ సక్సెస్ ఫుల్‌ హీరో అనిపించుకుంటున్నాడు. విబిన్నతరహా  సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్నాడు. అయితే ఈ రోజు గురు పూజోత్సవం సందర్భంగా తనతో పని చేసిన దర్శకులందరికి ధన్యవాదాలు తెలిపారు.

నటుడిగా నా ప్రయాణంలో దర్శకులు ఎప్పుడూ అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తులు. మీరు నాపై చూపిన ప్రభావం కేవలం ఒక సినిమాతో మరచిపోయే విషయం కాదు. ప్రతి ఒక్కరి నుంచి చాలా నేర్చుకున్నాను. అందరికి ధన్యవాదాలు అంటూ వరుణ్‌ ట్వీట్‌ చేశారు.