ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు: ప్రధాని మోదీ

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. జాతికి ఉపాధ్యాయులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఆయన అన్నారు. జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని.. విద్యార్థుల భవిష్యత్ ను గొప్పగా మలచడంలో వారి పాత్ర చాలా ఉంటుందని అన్నారు. గురుపూజా దినోత్సవం సందర్భంగా దేశంలోని ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలతో పాటూ సర్వేపల్లి రాధాకృష్ణణ్‌కు నివాళులు అర్పిస్తున్నానని మన గురువులే మన హీరోలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.