అక్వా రైతుల ఆక్రందన సభను విజయవంతం చేసిన ప్రజలందరికి కృతజ్ఞతలు: పితాని

ముమ్మిడివరం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నవంబర్ 30వ తేదీ, మంగళవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆక్వా రైతుల ఆక్రందన సభను విజయవంతం చేసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నాయకులకు, ఏడు నియోజకవర్గాల జనసేన పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, అభిమానులకు, వీర మహిళలకు, ప్రజానీకానికి మరియు ఆక్వా రైతులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జి పితాని బాలకృష్ణ తెలిపారు.