అన్నమయ్య జిల్లాకు పైసా ఉపయోగం లేని సీఎం పర్యటన: తాతంశెట్టి

అన్నమయ్య జిల్లా: జగనన్న విద్యాదీవెన పథకం 4వ విడత నిధులు విడుదల నిమిత్తం బుధవారం అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో సీఎం జగన్ పర్యటించడం జరిగింది. ఈ పర్యటనపై రైల్వే కోడూరు జనసేన నాయకులు తాతంశెట్టి నాగేంద్ర స్పందిస్తూ
ముఖ్య మంత్రి గారు ప్రజలతోనే పొత్తు.. అన్న మీ ఎత్తులను ప్రజలు గుర్తించారని, ఊకదంపుడు ఉపన్యాసం తప్ప.. అన్నమయ్య జిల్లాకు పైసా ఉపయోగం లేని మీ పర్యటన అంటూ విమర్శనాస్త్రాలుసందించారు.. మాట వరసకైనా మాట్లాడని అన్నమయ్య డాం బాధితుల కష్టాలు.. ప్రజలు గుర్తించారని, బొకేలతో స్వాగతం.. కాళ్లకు నమస్కరించడం తప్ప తమ నియోజక వర్గాల్లో సమస్యలను మీకు చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారని, చదువు గురించి ఉపన్యాసం ఇచ్చే మీరు.. ఉద్యోగం, ఉపాధి కల్పించలేని మీ నిస్సహాయతను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను విమర్శించడం విడ్డూరమని తాతంశెట్టి నాగేంద్ర ఎద్దెవా చేసారు.