Tanuku: జనసైనికునికి ధనసహాయం చేసిన ప్రతి ఒక్కరికి పాదభివందనాలు: అనుకుల రమేష్

తణుకు పట్టణం 7వవార్డు లో కేవలం జనసేన కండువా వేసుకున్నాడని వైకాప నాయకులు దాడి చేయగా సుమారు 18 రోజులు హాస్పటల్లో పోరాడి చివరికి ఆరోగ్యంగా తిరిగి వచ్చిన జనసేన పార్టీ కార్యకర్త బి.సి నాయకుడు పిల్లాడి పూర్ణరామారావును పరామర్శించి అతనికి భరోసా ఇవ్వడం జరిగింది. అతనికి 50,000/- ధన సహాయం చేసిన ప్రతి ఒక్క జనసైనికుడికి పాదాభివందనాలు తెలియచేసుకుంటున్నాని, ఈ సందర్భంగా మాకు సపోర్టుగా నిలిచిన జిల్లా అధ్యక్షుడు శ్రీ కొటికలపూడి గోవింద్(చినబాబు)గారికి, బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అర్జునుడుపాలెం ప్రెసిడెంట్ పోతుల గంగాధరం గారికి, తిరపతిపురం ప్రెసిడెంట్ కాండూరి లీల మణికంఠ గారికి, కానూరి మాధవ రాయుడుగారికి, ఇందిరమ్మ కాలనీలోని రాజు గారికి,షావుకారు గారికి,అడబాల మణికంఠ, సాయి, శివ, స్వామి, తదితర జనసేన నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ తణుకు నియోజకవర్గం లో జనసేన పార్టీ ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా నేను వారికి అండగా ఉంటానని హామీ ఇస్తున్నానని జనసేన నాయకులు అనుకుల రమేష్ తెలిపారు.