ర్యాలీ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం, మత్స్యకారులను ఈ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా చూస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే మత్స్యకారులు బుద్ధి చెబుతారని పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార విభాగం కార్యదర్శి కంబాల దాసు హెచ్చరించారు. మత్స్యకారులకు బాసటగా జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మత్స్యకారుల నిరసన కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ మత్స్యకార విభాగం రాష్ట్ర కార్యదర్శి కంబాల దాసు నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన నాయకులు, కార్యకర్తలు మత్స్యకారులు భారీ ఎత్తున బయలుదేరి యు కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామం నుండి భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో కాకినాడ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్, కంబాల దాసు మీడియాతో మాట్లాడారు కాకినాడ మత్స్యకారులకు బాసటగా కార్యక్రమానికి భారీ బైక్ ర్యాలీతో చేరుకున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్, మత్స్యకార నాయకులు కంబాల దాసు వేలాదిమందిగా బైక్ ర్యాలీలో తరలివచ్చిన మత్స్యకారులు జనసైనికులతో కలిసి జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని గజమాలతో సత్కరించడం జరిగింది. ఈ భారీ బైక్ ర్యాలీలో వేలాది మందిగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న మత్స్యకార నాయకులకు, మత్స్యకార సోదరులకు, నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు జనసైనికులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పిఠాపురం జనసేన నాయకులు మరియు శ్రీవిష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు.