ఈశ్వరమ్మ కాలనీలో జనంకోసం జనసేన

మదనపల్లె, జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగగా గంగారపు రామదాసుచౌదరి ఆధ్వర్యంలో ఈశ్వరమ్మ కాలనీలో పర్యటించి అక్కడ ఉన్న స్థానిక సమస్యలు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాట్లాడతామని స్థానిక ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, మదనపల్లె రూరల్ అధ్యక్షుడు గ్రానైట్ బాబు, ఐటీ విభాగం జగదీశ్, జనార్ధన కుమార్, వీర మహిళ రెడ్డమ్మ, అర్జున్, పవన్, కృష్ణ, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.