జిల్లా కార్యదర్శి మొగలి అప్పారావుపై దాడి చాలా బాధాకరం

పిఠాపురం నియోజకవర్గం, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి మొగలి అప్పారావు మీద మంగళవారం జరిగిన దాడి చాలా బాధాకరం. కేవలం ఇంటి విషయంలో మాట్లాడటానికి వెళ్లిన వ్యక్తిపై దాడిచేయడం అనేది చాలా ఘోరం. తుని నియోజకవర్గం నుండి జిల్లా జాయింట్ సెక్రటరీ, తుని టౌన్ నాయకులు అద్దేపల్లి బాలాజీ, తుని నాయకులు బొప్పన రాంబాబు బుధవారం వారి ఇంటిదగ్గర కలిసి పరామర్శించటం జరిగింది. ఇంటిదగ్గర కొట్టడమే కాకుండా కేవలం 2000 రూపాయలు సుపారీ తీసుకొని హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ ముందే కొట్టడం అనేది చాలా చాలా దారుణం. సుపారీ ఇచ్చిన వాళ్ళను మాత్రం అస్సలు వదలకూడదు, వారిపై వెంటనే కేసు నమోదు చెయ్యాలి అని జిల్లా జనసేవపార్టీ కార్యవర్గానికి తెలియజేయటం జరిగింది.