ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ను గెలిపించండి- శ్రీమతి ముమ్మారెడ్డి

కూకట్పల్లి నియోజకవర్గం: మూసాపేట్ డివిజన్, యాదవ్ బస్తీలో పాదయాత్రను ప్రారంభించిన బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ సతీమణి శ్రీమతి ముమ్మారెడ్డి విజయలక్ష్మి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి జనసేన, బిజెపి సిద్ధాంతాలను వివరిస్తూ, కరపత్రాలను పంచుతూ.. పాదయాత్ర చేస్తూ కూకట్పల్లి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల కంటే అత్యున్నత విద్యావంతుడు, వివేకశీలి, నిరాడంర కలిగిన వ్యక్తి, ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేలాదిమంది పేదలకు సహాయం అందిస్తున్నారు. ఎంతో మంది విద్యార్థులను చదివిస్తున్నారు. ముఖ్యంగా కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రజలకు 30 సంవత్సరాలుగా అందుబాటులోనే ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఓటర్ మహాశయులారా ఈసారి మీ అమూల్యమైన ఓటును గాజు గ్లాసు గుర్తు మీద వేసి అఖండ మెజారిటీతో శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గారిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిట్ల మనోహర్, తూము శైలేష్, ఇ.సాయి, దాకయ్య, రవి గౌడ్, అభిషేక్, పద్మజ, తేజశ్రీ, బిజెపి నాయకులు, జనసేన నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.