జనసేన చొరవతో కదలిన అధికార యంత్రాంగం

గుంతకల్లు నియోజకవర్గం: గుంతకల్లు టౌన్ నందు ఎప్పుడూ రద్దీగా ఉండే కసాపురం రైల్వే అండర్ బ్రిడ్జి యొక్క దుస్థితిని మరియు ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుంతకల్లు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకొని వెళ్లగా.. వెంటనే స్పందించిన కమిషనర్ తాత్కాలిక పరష్కారం చూపించినందుకు జనసేన పార్టీ తరపున అనంతపురం జిల్లా సంయుక్త జనసేన కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన్ మాట్లాడుతూ గుంతకల్లు నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిచిన వెంటనే కసాపురం రైల్వేఅండర్ బ్రిడ్జి సమస్యను శాశ్వత పరిష్కారం చేస్తానని తెలిపారు.