ముఖ్యమంత్రిని మంచి ఈ.ఎన్.టి. వైద్యుడికి చూపించాలి

  • ఆయనకు వినికిడి శక్తి లోపించింది
    • పవన్ కళ్యాణ్ ఒకటి మాట్లాడితే… జగన్ రెడ్డికి మరోలా వినిపిస్తోంది
    • 30 మంది స్టెప్నీలు అనగానే సీఎం ఎందుకు ఉలిక్కిపడుతున్నారు
    • రాసలీలలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ
    • ఉత్తరాంధ్రను గంజాయి, కబ్జాలకు అడ్డాగా మార్చింది ఏ1, ఏ2లు కాదా?
    • మంత్రులు భాష మార్చుకోకపోతే… జగన్ రెడ్డికి ఇచ్చినట్లు వరంగల్ ట్రీట్మెంట్ ఇస్తాం
    • ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్

ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మాట్లాడుతూ… “ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అత్యవసరంగా బాగా అనుభవం ఉన్న ఈ.ఎన్.టి. డాక్టర్ కి చూపించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాంటి డాక్టర్ హైదరాబాద్ లో ఉన్నా బెంగళూరులో ఉన్నా పిలిపించి జగన్ చెవులు, గొంతు, నాలుక చెక్ చేయించాలి. ఇవాళ కృష్ణా జిల్లా అవనిగడ్డ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేసేలా పవన్ కళ్యాణ్ గురించి పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ఆయనకు వినికిడి శక్తి లోపించి. చెవిటితనంతో బాధపడుతున్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మంచిదని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఏనాడు అలా మాట్లాడలేదు. ఒక పెళ్లి చేసుకొని 30 మంది స్టెప్నీలను పెట్టుకొనే వాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడగానే ముఖ్యమంత్రి ఎందుకు భుజాలు తడుముకున్నారో, ఎందుకు ఉలిక్కిపడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి.
• దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి రండి… ప్రజా తీర్పు కోరదాం
చాలా మంది వైసీపీ నాయకులకు ఎంతమంది స్టెప్నీలు ఉన్నారో ఎవరికీ తెలియదు. ఒక మంత్రి అరగంట, పావుగంట అంటాడు. సుకన్య, సంజన పోయి ఈమధ్య ప్రశాంతి వచ్చింది. ఉత్తరాంధ్రకు చెందిన మరో మాజీ మంత్రి గంట చాలు అంటాడు. ఇంకో ఎంపీ ఏకంగా ప్యాంటు జిప్ విప్పి చూపిస్తాడు. రాసలీలలకు వైసీపీ బ్రాండ్ అంబాసిడర్. మీలాంటి వ్యక్తులా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 175 సీట్లకు గానూ 175 గెలుస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మీకు నిజంగా దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజల తీర్పు కోరుదాం రండి.
• విశాఖ వెళ్లాలంటే అనుమతి కావాలా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికే ఉందా? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో ఉందా? ఎవరైనా ఉత్తరాంధ్రాకు రావాలంటే పర్మిషన్లు తీసుకోవాలా? అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటనను అడుగడుగునా అడ్డుకున్నారు. విమానాశ్రయం వద్దకు ఆయనకు స్వాగతం చెప్పడానికి వచ్చిన జనాన్ని చూసి ఓర్వలేక జనవాణి కార్యక్రమం జరగకుండా చేశారు. ఎయిర్ పోర్టులో మంత్రులపై దాడి జరిగిందని వైసీపీ వాళ్లు మాట్లాడుతున్నారు. ప్రశాంతతకు మారుపేరైనా ఉత్తరాంధ్రను గంజాయి వనంగా, కబ్జాలకు కేంద్రంగా మార్చింది ఏ1 జగన్, ఏ2 విజయసాయి రెడ్డి కాదా?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి సంఘీభావం తెలపడానికి వస్తే ప్యాకేజీ అని మాట్లాడుతున్నారు. ఆయన ప్యాకేజీ తీసుకోవడానికి బ్రోకరిజం చేసింది మీయమ్మ మొగుడా? లేకపోతే తెరచాటుగా మీరే చేశారా? అనేది ఆ మాట మాట్లాడే వాడు చెప్పాలి. ఇలాంటి భాష మాట్లాడటానికి సిగ్గుపడుతున్నాం. కానీ బూతుల మంత్రులకు ఇలా మాట్లాడితేనే అర్ధమవుతుందని ఇలా చెబుతున్నాం. వాళ్లు మాట్లాడే భాష చూసి వాళ్ల తల్లిదండ్రులు కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారు. మీకు చేతనైతే పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అంతే తప్ప వ్యక్తిగత దూషణలకు దిగితే చూస్తూ ఊరుకునేది లేదు. దమ్ముంటే ఉత్తరాంధ్ర రా అని సవాల్ చేసిన గుడివాడ అమరనాథ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ విశాఖ రాగానే ప్రజాసందోహం చూసి దాక్కుండిపోయాడు. టైమ్, ప్లేస్ చెప్పండి అని జోగి రమేష్ ఛాలెంజ్ చేశాడు. ఆయనకు ఒకటే చెబుతున్నాం. మీ స్థాయికి పవన్ కళ్యాణ్ అవసరం లేదు. జనసైనికుడు చాలు. ఇంకోసారి పవన్ కళ్యాణ్ జోలికి వస్తే తరిమితరిమి కొడతాం. చెత్త పుత్రుడు జగన్ రెడ్డిగానీ, అతని పార్టీవాళ్ళు గానీ మరోసారి ఇలాంటి చెత్త వాగుడు వాగితే వాళ్ళ ఇళ్ళకి చెప్పులు పార్సిల్ పంపిస్తాం” అని అన్నారు.