ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ మాచర్లలో ముఖ్యమంత్రి సభ

గుంటూరు: జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ మాచర్లలో ముఖ్యమంత్రి సభ జరిగింది. ప్రాజెక్ట్ దగ్గర శంకుస్థాపన చేయకుండా స్టేజ్ పైనే శంకుస్థాపన చేసే గొప్ప ముఖ్యమంత్రి జగన్. గతంలో తన తండ్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ కే జగన్ మళ్ళీ శంకు స్థాపన చేశారు. ప్రతి ఏకరానికి నీరు ఇవ్వక పోతే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను అని మాట్లాడిన ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజలకు ఏం చెప్తారు. ఎమ్మెల్యే ఇచ్చిన మాటను కప్పి పుచ్చుకునేందుకు తూతూమంత్రంగా వరికపూడిశలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రోడ్డుపై వెళ్లి ఉంటే పల్నాడులో రైతుల పరిస్థితి తెలిసి ఉండేది. పల్నాటి ప్రజలకు పౌరుషం ఉంటే ఎమ్మెల్యే కి ఒక్క ఓటు కూడా వేయవద్దు. రానున్న రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిర్ణీత సమయంలో వరికపూడిశల ప్రాజెక్ట్ ను పూర్తి చేసి సాగు, త్రాగు నీటిని అందిస్తాం. కమిషన్లపై తప్ప అభివృద్ధిపై వైసిపికి దృష్టి లేదు. పొన్నూరు బస్సు యాత్రలో నడి రోడ్డుపై స్టేజి వేసి ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఈ కార్యక్రమంలో నారదాసు రామచంద్ర ప్రసాద్, కొర్రపాటి నాగేశ్వరరావు, శిఖా బాలు, నెల్లూరు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.