48 గంటలలో సమస్య పరిష్కరించిన కొరియర్ శ్రీను

మచిలీపట్నం నియోజకవర్గం మల్కాపట్టణంలోని పైలాన్ పార్క్ వద్ద 2019లో డ్రైనేజీ మరమ్మత్తుల నిమ్మిత్తం కల్వర్ట్ ని పగులగొట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ కల్వర్ట్ ని తిరిగి నిర్మించలేదు. దీని వలన స్థానిక ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పాలకులకు, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు. సోషల్ మీడియాలో ఎస్విటి యాక్స్ టైలర్ జనసేన నాయకులు కొరియర్ శ్రీనుకి తెలియపరచడం జరిగింది. దీనిపై స్పందించిన కొరియర్ శ్రీను సమస్యను 48 గంటలలో పరిష్కరించడం జరిగింది.