పూడిమడక తీరంలో విద్యార్థుల మృతి విషాదకరం

ఉమ్మడి విశాఖ జిల్లా పూడిమడక దగ్గరి సముద్ర తీరంలో చోటు చేసుకున్న దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందటం విషాదకరమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షలు పూర్తి చేసుకున్న ఆ విద్యార్థులు మృత్యువాతపడటం ఆవేదన కలిగించింది. ఆ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలు పెట్టుకొన్న తల్లితండ్రులు, కుటుంబ సభ్యులకు ఈ విషాదం తీవ్ర శోకాన్ని మిగిల్చింది. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. సాగర తీరాలకు, నదీ తీరాలకు విహారానికి వెళ్ళే విద్యార్థులు, యువత తగు జాగ్రత్తలు పాటించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.