శతఘ్ని న్యూస్ కి ల్యాప్ టాప్ బహుకరించిన హైదరాబాద్ జనసైనికుడు

హైదరాబాద్, ఎంతో ఆశయంతో అలుపెరుగని ప్రయాణం చేస్తున్న శతఘ్ని న్యూస్ శ్రమను గుర్తించి విజయవాడకు చెందిన హైదరాబాద్ జనసైనికులు శనగల రఘు సచ్చింద్ర కుమార్ శనివారం శతఘ్ని న్యూస్ ఫౌండర్ నాయుడు నిమ్మకాయల కు శనివారం వారి స్వగృహంలో ఒక ల్యాప్ టాప్ ను బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా శతఘ్ని న్యూస్ ఫౌండర్ నాయుడు నిమ్మకాయల మాట్లాడుతూ… మా ఆశయాన్ని గుర్తించి మా ఇబ్బందులను గమనించి మాకు సహకరించడం కోసం ఏమి కావాలి అని కనుక్కుని మరీ ల్యాప్ టాప్ బహుకరించిన శనగల రఘు సచ్చింద్ర కుమార్ కి నా తరపున మరియు మా శతఘ్ని న్యూస్ టీం తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నామని తెలిపారు. మాలో నూతనోత్తేజాన్ని నింపినందుకు మరింత ఉత్సాహంతో శతఘ్ని న్యూస్ ను మరింత ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు.