జనంలోకి జనసేన సిద్దాంతాలు

గుంటూరు: సోమవారం జనంలోకి జనసేన సిద్దాంతాలు. 29వ డివిజన్ దర్యానగర్, నగరంపాలెం ఏసీ కాలేజీ ఎదురు రోడ్డులో కొన్ని కుటుంబాలను కలసి పవన్ కళ్యాణ్ మనోగతం అనే పుస్తకంలో ఉన్న అమూల్యమైన విషయాలను కొన్ని కుటుంబాలకు తెలియజేసి వారు మరో పది మందిని ఉత్తేజ పరిచే విధంగా వివరించడం జరిగింది. ప్రతి మనిషికి వెయ్యి రూపాయలు ఇచ్చి ఓటు నీ కొంటూ రాజ్యాధికారం తన చేతిలో తీసుకొని ప్రజల దగ్గర నుంచి భారీగా టాక్స్ రూపంలో ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకుంటున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం దీనికి కారణం ఎవరు ఈసారి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయవలసిందిగా కోరుచున్నాము ప్రతి ఇంటికి తిరుగుతూ దీనికి కారణం ఎవరు అని తెలియజేసేలా వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు లక్ష్మీశెట్టి సాయిచంద్, పమీడీ పవన్, గోపిశెట్టి రాజశేఖర్, చందు శ్రీనివాసరావు, దలవై రాము, పసుపులేటి నరసింహారావు, ఓరబండి లెనిన్, రాకేష్, బొల్లా కిరణ్, సాంబశివరావు,క్. బాలకృష్ణ సుభాష్, బోళ్ల పవన్ కళ్యాణ్, పవన్, ఆది తదితర జనసైనికులు పాల్గొన్నారు.