విదేశీ విద్యాదీవెన పధకం పై జనసేనానికి వినతి

తిరుపతి, స్థానిక జిఆర్ఆర్ కన్వెన్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అమెరికాలో చదువుకుంటున్న సాయి కృష్ణ తేజ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ రేఖ జవాజి మరియు కర్నూలుకు చెందిన పవన్ కుమార్ ల సహాయంతో విదేశీ విద్యాదీవెన పధకం పై వినతిపత్రమివ్వడం జరిగింది. విదేశీ విద్యకు బడ్జెట్ లో మాత్రమే నిధులు కేటాయించడం జరిగిందని, విద్యార్ధులకు నిధులు మాత్రం ఇవ్వడం లేదని, వెబ్సైట్ కూడ సరిగా పని చేయడం లేదని, దీనిపై సోషల్ మీడియాలో కూడా యుద్ధం జరిగిందని వినతిపత్రంలో పేర్కొనడం జరిగింది.