మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి

డుంబ్రిగుడ మండలంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు కె చిన్న మరియు నియోజకవర్గ సమన్వయ కమిటీ కొన్నేడి లక్ష్మణరావు సాగర్ పంచాయితీ మరియు గసభ పంచాయితీ సున్నం మెట్ట కూడా గ్రామంలో పర్యటిన్చగ ఆ గ్రామస్థులు మా గ్రామంలో నీటి సమస్య అధికంగా ఉన్నది మేము కిలో మీటర్ దూరంలో గల పొలంలో బురద నీరు త్రాగడం వలన మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులకు గురి కావడం జరుగుతుందని తెలిపారు. ఈ సమస్య మీద పంచాయితీ సెక్రటరీ మరియు మండల ఉన్నత అధికారులు పరిష్కరించాలి లేని పక్షంలో మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపడతామని డిమాండ్ చేసారు.