భవిష్యత్తు జనసేనదే – మనుబోలు శ్రీనివాసరావు

తిరువూరు: విస్సన్నపేట మండలం,లోని తాతకుంట్ల గ్రామంలో ఆదివారం సాయంత్రం విసన్నపేట మండలం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు మండల అధ్యక్షులు షేక్ యాసిన్ లు అధ్యక్షత వహించారు.. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ రానున్న రోజుల్లో జనసేనదే భవిష్యత్తు అని, ప్రతి జనసైనికుడు అంకితభావంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, గ్రామ గ్రామాన జనసేన జండా కార్యక్రమం నిర్వహించాలని ఈ సందర్భంగా వారు మండల కార్యవర్గ సభ్యులకు దిశా నిర్దేశం చేశారు.. ముఖ్యంగా ఓటర్ లిస్ట్ లో దొంగ ఓట్లపై దృష్టి పెట్టాలని అధికారుల దృష్టికి పార్టీ దృష్టికి తీసుకురావాలని, గ్రామ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలని తెలుగుదేశం పార్టీతో ఉమ్మడి కార్యచరణ కార్యక్రమాలు ఉన్నప్పుడు సమైక్యంగా కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా వారు జనసైనికులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు చింతల తేజ, నందమూరి వెంకటేశ్వరరావు, అడపా శీను, బిల్లా నారాయణ, కస్తూరి సీతారామస్వామి, చింతల పండు, పర్సా సతీష్, జె. రవీంద్ర, పి. ప్రేమ చంద్, ప్రకాష్, కె. రమేష్, రాజేష్ విజయ్, టీ. కిషోర్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.