అమరావతి రైతులకు మద్దతుగా జనసేన

*అమరావతి రైతుల విజయం

తిరుపతి, హైకోర్టు తీర్పుతో అమరావతి రాజధానికి కొనసాగించాలని ఈ ప్రభుత్వానికి హైకోర్టు చెప్పడంతో శుక్రవారం తిరుపతి అలిపిరి శ్రీవారి పాదాల చెంత అమరావతి రైతులు కొబ్బరికాయలు కొట్టి పాదయాత్రగా తిరుమలకు వెళ్తున్నారు, వాళ్లకు సంఘీభావంగా జనసేన పార్టీ కూడా వారికి సంఘీభావం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్, తిరుపతి నియోజకవర్గ ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షులు రాజారెడ్డి మరియు వీరమహిళలు, ముఖ్య నాయకులు మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.