బీమ్లా నాయక్ సినిమా పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి

బీమ్లా నాయక్ సినిమా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా టికెట్ రేట్లు తగ్గించడం కి నిరసనగా జనసేన పార్టీ గుంటూరు జిల్లా జాయింట్ సెక్రటరీ ఖాసిం సైదా పిడుగురాళ్లలో మాట్లాడుతూ… ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రమే ఆంక్షలు విధించి బెనిఫిట్ షో రద్దు చేయడం టికెట్లు రేటు తగ్గించడం దారుణమన్నారు. టిక్కెట్ రేట్లు తగ్గిస్తే తగ్గిన డబ్బులతో జనసేన పార్టీలో నిరుపేదలైన 10 మంది కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయిస్తానని అన్నారు.