పల్లె పల్లెలో జనసేన జెండా రెపరెపలాడుతుంది

గుంటూరు: ముప్పాళ్ళ మండలం, దమ్మాలపాడు గ్రామంలో గ్రామ అధ్యక్షులు, పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన పార్టీ నూతన జెండాను రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు చేతుల మీదగా ఆవిష్కరించడం జరిగినది. జండా ఆవిష్కరణ అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గ్రామస్తులంతా కలిసి చాలా గొప్పగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని పరిచయం చేస్తూ ఇంత అఖండ స్వాగతాన్ని మాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేశారు. ఇదే ఉత్సాహంతో మనందరం రానున్న ఎలక్షన్లో పనిచేసి ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలో నాకు పోటీ చేసే అవకాశం ఇచ్చిన లేదా ఇంకెవరికి అవకాశం ఇచ్చిన ఇదేవిధంగా ప్రతి ఊరు తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్తూ ప్రచారం చేసి గెలిపిస్తానని అందరి సమక్షంలో మాటిస్తున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు, తిరుమల శెట్టి మల్లేశ్వరి, గ్రామ అధ్యక్షుడు రుద్రజడ శివయ్య, దమ్మాలపాడు ఎంపీటీసీ సిరిగిరి రామారావు, రాడ్లు శ్రీనివాసరావు, హిమాంస కుమ్మరి ఏడుకొండలు, సూరంశెట్టి సతీష్ తదితరులు పాల్గొన్నారు.