మానవత్వం చాటుకున్న జనసేన నాయకులు

  • యాక్సిడెంట్ కు గురైన దంపతులను ఆసుపత్రికి తరలింపు

జగ్గయ్యపేట నియోజకవర్గం, పెనుగంచిప్రోలు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకొని వెళుతున్న భార్యా భర్తలు బైక్ యాక్సిడెంట్ కు గురై ప్రక్కనే ఉన్న ముళ్ల పొదల్లో పడిపోగా.. అటుగా వెళుతున్న జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు బోలియశెట్టి శ్రీకాంత్ మరియు ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బాడిశ మురళీకృష్ణ తక్షణమే 108 కాల్ చేసి ముళ్ల పొదల్లో నుంచి వారి ఇరువురిని పాదాచారుల సహాయంతో 108 వాహనం ఎక్కించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించడం జరిగింది.