పొట్టి శ్రీరాములుకు పిడుగురాళ్ల జనసేన ఘననివాళులు

గురజాల: ఆంధ్రరాష్ట్ర అవతరణకు అసువులు బాసిన సంగోద్దారకుడు, ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలను అర్పించిన వ్యక్తి, బాషాప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యుడు, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా.. గురువారం పిడుగురాళ్ల జనసేన పార్టీ ఆధ్వర్యంలో జానపాడురోడ్డు లొని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆవరణలో మండల ప్రధాన కార్యదర్శి చీదెళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో.. జనసేన నాయకులు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆనాడు ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం తెలుగు వారి అందర్నీ ఏకం చేయటానికి కులమతాలకతీతంగా తన ప్రాణాల సైతం తృణప్రాయంగా భావించి, అసలు బారిన అమరుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారని, గాంధీ గారి బాటలో సత్యం, అహింస, హరిజనోద్దరణ, అనే అంశాలను ఆయుధాలుగా భావించి, జీవితాంతం అమలుపరిచిన గొప్ప వ్యక్తిని కొనియాడారు, ఆయన ఏ ఉద్దేశంతో అయితే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యం పోసిన వ్యక్తిని, ఆంధ్ర రాష్ట్రం అవతరించడానికి ఆయన ప్రాణం సైతం త్యాగం చేసి తెలుగు వారందరి గుండెల్లో అమరజీవిగా నిలిచిపోయారని కొనియాడారు, ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కామిశెట్టి రమేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాసిం సైదా, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దూదేకుల సలీం, పిడుగురాళ్ల మండల ఉపాధ్యక్షులు పెడకొలిమి కిరణ్ కుమార్, మండల కార్యదర్శి షేక్ గఫూర్, గుర్రం అశోక్, కాశి, కొమ్మ అశోక్, కొత్త శ్రీనివాసరావు, రాజారెడ్డి, బిజెపి పట్టణ అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, మొదలగు వారు పాల్గొన్నారు.