పంతం నానాజీ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జనసేన శ్రేణులు

కాకినాడ రూరల్: జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ని నూతన సంవత్సర సందర్బంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన శ్రేణులు, గజమాలలతో, పూలబోకేలతో, శాలువాలతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలియచేసారు.. ఈ సందర్బంగావిచ్చేసిన వారందరికీ అల్పాహారం, స్వీట్స్, ఫ్రూట్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా తదేకం ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన ట్రై సైకిల్ ను దివ్యంగునికి జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, మరియు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.