జనసేన గెలుపుతో మార్పునకు నాంది

రేపల్లె పురపాలక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించి మార్పునకు నాంది పలకాలని ఆ పార్టీ రేపల్లె నియోజకవర్గ బాధ్యుడు కమతం సాంబశివరావు ప్రజలను కోరారు. స్థానిక పదో వార్డులో మంగళవారం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి తమ పార్టీ అభ్యర్థి గాదె నాగచైతన్యకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఓటర్లకు కరపత్రాలు పంపిణీ చేశారు. 4, 24వ వార్డు నుంచి పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థులు మేత్ర లక్ష్మీరాజేశ్వరి, బెల్లంకొండ హరికృష్ణతోపాటు నాయకులు ఆయా వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.