నూతన బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

అన్నమయ్య జిల్లా పాలన అధికారిగా బాధ్యతలు చేపట్టిన అభిషిక్త్ కిషోర్ కి జనసేన రాయచోటి అసెంబ్లీ ఇన్చార్జ్ హసన్ బాషా మరియు జిల్లా నాయకులు రామ శ్రీనివాస్ ఇతర నాయకులు కలెక్టర్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో ఆయనను సత్కరించారు. జిల్లాలో సుపరిపాలన అందించాలని జిల్లాలో బోగస్ ఓట్లను గుర్తించి రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ నిర్వహించాలని కలెక్టర్ కి తెలియజేశారు. అలాగే జిల్లా అభివృద్ధి కోసం రాజీలేని పోరాటం చేయాలని అందరిని సమానంగా చూడాలని ప్రత్యేకంగా జనసేన నాయకులు ఇన్చార్జ్ మరియు జిల్లా నాయకులు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయచోటి అసెంబ్లీ ఇంచార్జ్ షేక్ హసన్ బాషా అన్నమయ్య జిల్లా కో-ఆర్డినేటర్ రామ శ్రీనివాస్, జనసేన నాయకులు దినేష్, జిల్లా కార్యక్రమాల కార్యదర్శి రియాజ్, వెంకటయ్య, మురళి, రవీంద్ర, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.