ఆవిర్భావ సభ దిగ్విజయంగా జరగాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన నాయకులు

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరగబోయే జనసేన పార్టీ 10 వ ఆవిర్భావ దినోత్సవం దిగ్విజయంగా జరగాలని, మరియు, రాబోయే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని కోరుతూ పట్టణంలోని స్థానిక శ్రీశ్రీశ్రీ నీలకంటేశ్వర స్వామి దేవాలయంలో ఆపార్టీ నాయకులు రాహుల్ సాగర్, కరణం రవి, బజారి నాయుడు, లు కలసి శివలింగాకి పంచామృత అభిషేకం నిర్వహించిన అనంతరం జనసేన పార్టీ అధికారంలోకి రావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం చాలా అవసరం అని అన్నారు, రాష్ట్రంలోని యువతి, యువకులు, ఉపాధి అవకాశాలు లేక ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురఅవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, యువతి యువకుల జీవితాలు బాగుపడాలంటే కార్మికుల కడుపు నిండాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రమేష్, వెంకటేష్, సురేష్, మల్లి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.